పులివెందులలో గెలిచి, టిడిపి చరిత్ర సృష్టిస్తుంది – చంద్రబాబు

-

పులివెందులలో గెలిచి టిడిపి చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ కూడా కుప్పంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పుంగనూరు తో పాటు మిగిలిన నియోజక వర్గాలలో వైసీపీ నేతలకు సరైన మొగుల్లనే అభ్యర్థులుగా పెడుతున్నానని.. కార్యకర్తలు ధైర్యం గా ఉండండని కోరారు.

టిడిపి వస్తె పథకాలు అపెస్తానని ప్రచారం చేస్తున్నారు….టిడిపి అధికారం లోకి వస్తె నవ రత్నాలకు మించిన పథకాలు తెస్తానని వెల్లడించారు చంద్రబాబు. పేద వారికి అన్నం పెట్టే పార్టీ టీడీపీ..పేదల పొట్టకొట్టే పార్టీ వైసీపీ అని విమర్శలు చేశారు. కుప్పం మోడల్ కాలనీ అభివృద్ధి బాధ్యత నాదే….కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజలకు హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడించాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. లేకపోతే.. రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news