రెస్టారెంట్లు, హోటళ్లకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

-

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా.. హోటళ్లు మరియు రెస్టారెంట్లు రాత్రి 12 గంటల వరకూ తెరుచుకోవచ్చని జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ పేర్కొంది. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 5 గంటల సమయం నుంచి.. రాత్రి 12 గంటల వరకు రెస్టా రెంట్లు, హోటల్స్‌ తెరిచి.. ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది జగన్‌ సర్కార్‌.

సీఎం జగన్
సీఎం జగన్

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి… ఉంచాలని ఆదేశించింది. కరోనా పరిస్థితులు మారిపోవడం.. కేసుల సంఖ్య తగ్గడంతో.. మళ్లీ.. రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం హోటల్స్‌, రెస్టారెంట్‌ యజమానులకు తీపి కబురని చెప్పాలి. అలాగే.. కస్టమర్లు కూడా చక్కగా హోటల్స్‌, రెస్టారెంట్‌ లలో రాత్రి 12 గంటల వరకు ఫుడ్‌ తీసుకెళ్లవచ్చను అన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news