ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..పదవి విరమణ పెంపు !

-

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే ఈ పదవి విరమణ వయస్సు పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది.

రాష్ట్ర కన్సలిడేటెడ్ ఫండ్ నుంచి వేతనాలు తీసుకుంటున్న స్థానిక సంస్థలు, శాసన పరిషత్, రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. న్యాయాధికారులు, గ్రామ అధికారులు మినహా 309 అధికరణ కింద నియమితులైన ఉద్యోగులు అధికారులకు మాత్రమే ఇది వర్తిస్తుందట.

అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో 62 ఏళ్ల ఉద్యోగ విరమణ పెంపు వర్తిస్తుందని ఆదేశాలు ఇవ్వటంపై ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అనుమతి, అధికారం లేకుండా ఆయా సంస్థలు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news