BREAKING : రేపు ఢిల్లీకి సీఎం జగన్‌.. ప్రధాని మోడీతో కీలక సమావేశం

-

BREAKING : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి..ఢిల్లీ టూర్‌ ఫిక్స్‌ అయింది. రేపు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పై ఈ కీలక సమావేశంలో సీఎం జగన్‌ చర్చించనున్నారు.

పోలవరం ప్రాజెక్టు తో సహా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం జగన్‌. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ కు ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామం నుంచి రాజధానుల వరకు వికేంద్రీకరణే తమ విధానం అని పునరుద్ఘాటించిన సీఎం జగన్‌.. దీనిపై ప్రధాని మోడీకి వివరించే ఛాన్స్‌ ఉంది. రేపు ఉదయం 10 గంటల సమయంలో సీఎం జగన్‌ ఏపీ నుంచి ఢిల్లీకి బయలు దేరనున్నారు. ఎల్లుండి తిరిగి ఏపీకి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news