టిడిపి పార్టీకి రాజీనామా..క్లారిటీ ఇచ్చిన దివ్యవాణి

-

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, టాలీవుడ్ సినీ నటి దివ్య వాని రాజీనామా ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. తాజాగా నిన్న రాత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసారు దివ్యవాణి. ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మీడియా తో మాట్లాడారు.

నా ఆవేదనను ఓ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నానని.. కొంత మంది విశ్లేషకులు నా గురించి ఏదేదో మాట్లాడారు.. చెప్పుతో కొట్టాలనిపించిందని వెల్లడించారు. పార్టీలో నాకు ఎదురైన ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఫేక్ వార్తలు.. తప్పుడు సర్కులేషన్లు వచ్చినప్పుడు సంయమనంతో ఉండాలని చంద్రబాబు సూచించారు… ఇప్పటి వరకు నా శక్తికి మించి పని చేశానని తెలిపారు. త్వరలోనే మళ్లీ చంద్రబాబును కలుస్తానని స్పష్టం చేశారు దివ్య వాని.

 

Read more RELATED
Recommended to you

Latest news