ఆ ఆస్తులు మాధురి పేరుపై రాసాను – దువ్వాడ శ్రీ‌నివాస్‌

-

ఆ ఆస్తులు మాధురి పేరుపై రాసాను అని పేర్కొన్నారు దువ్వాడ శ్రీ‌నివాస్‌. తాజగా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురి. ఈ సందర్బంగా దువ్వాడ శ్రీ‌నివాస్‌ మాట్లాడుతూ.. నా ఆస్తుల‌న్నీ భార్యాపిల్ల‌ల‌కు రాసేశాను.. అయినా పిల్ల‌ల బాధ్య‌త నా మీద ఉంది అని పేర్కొన్నారు.

Duvvada Srinivas, Divvala Madhuri Spotted in Tirumala

ఎన్నిక‌ల్లో నా కోసం మాధురి కొంత న‌గదు ఖ‌ర్చు చేశారు.. అందుకే కొంత ఆస్తి ఆమె పేర రాశాను అంటూ బాంబు పేల్చారు దువ్వాడ శ్రీ‌నివాస్‌. ఈ గొడ‌వ‌ల వ‌ల్ల‌ మాధురికి కూడా అన్యాయం జ‌రిగింది.. అందుకే ఆమెకు నేను అండ‌గా ఉన్నానని చెప్పారు దువ్వాడ శ్రీ‌నివాస్‌.

మాధురి మాట్లాడుతూ… ఏటా నేను బ్ర‌హ్మోత్సవాల‌కు తిరుమ‌ల‌ వ‌స్తాను అన్నారు. గ‌తంలో నా డ్యాన్స్ టీమ్‌తో మాడ‌వీధుల్లో ప్రోగ్రామ్స్ చేయించానని చెప్పారు. ఇక‌పై దువ్వాడ శ్రీ‌నివాస్‌తోనే క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాను.. అందుకే ఇద్ద‌రం క‌లిసి స్వామివారిని ద‌ర్శించుకున్నామన్నారు మాధురి.

Read more RELATED
Recommended to you

Exit mobile version