బ్రేకింగ్ : ఏపీలో మరో కరోనా క్వారంటైన్ లో అగ్ని ప్రమాదం

-

 

విశాఖ పట్నాన్ని అగ్ని ప్రమాదాలు వదిలేలా కనపడడం లేదు. ఎల్జీ పాలిమర్స్ మొదలు మొన్నటి రాంకీ ఫార్మా సిటీ ప్రమాదం దాకా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. అలానే మొన్న విజయ వాడలో జరిగినట్టుగానే కరోనా క్వారంటైన్ సెంటర్ లో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

fire
fire

విశాఖపట్నంలోని కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి క్యాంపస్ లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాద్మలో భారీగా కంప్యూటర్స్ దగ్దం అయినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. అయితే ఈ కాలేజ్ లో ప్రస్తుతం ప్రభుత్వం కరోనా క్వారంటైన్ నడుపుతున్నట్టు చెబుతున్నారు. దీంతో ఆ బాధితులను అందరినీ మరో బ్లాక్ కి తరలించారు. సకాలంలో పోలీసు, ఫైర్ సిబ్బంది స్పందించడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news