రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొననున్న మాజీ మంత్రి రఘువీరా

-

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో మర్యాదపూర్వకంగా పాల్గొనబోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి రఘువీరారెడ్డి. ఈనెల 18న రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో భారత్ జూడో యాత్ర ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ నీలకంఠాపురం గ్రామంలో నూతనంగా రూపుదిద్దుకుంటున్న నీలకంఠాపురం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు మరియు దేవాలయంలొ ప్రత్యేక పూజలు నిర్వహించి వస్త్రం ఇవ్వనున్నారు ఆలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి.

మన రాష్ట్రానికి రావడంతో మన నీలకంఠాపురం దేవస్థానము తరపున రాహుల్ గాంధీని కలవడం జరుగుతుందన్నారు రఘువీరారెడ్డి. ” ప్రస్తుతం రాజకీయాలకు నేను పూర్తిగా దూరంగా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు 30 సంవత్సరాలుగా నాతో కలిసి అడుగులో అడుగు వేసిన వారి అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటా. ఇప్పటికీ నేను రాజకీయాలకు దూరంగానే ఉన్నా.. దేవాలయం పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేసిన తర్వాతే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటా”. అని తెలిపారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news