BREAKING: ఏపీలో మెట్రో పరుగులకు గ్రీన్ సిగ్నల్..!

-

Green signal for metro runs in AP: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. మెట్రో పరుగులకు ప్రభుత్వం మళ్లీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, విజయవాడలో మెట్రోను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో 26 కిలోమీటర్ల మేర.. రెండు మెట్రో కారిడార్లను నిర్మించాలని సంకల్పించింది. ఈ కారిడార్లలో 25 స్టేషన్లు ఉంటాయని తెలిపింది.

Green signal for metro runs in AP

విశాఖలో 34.38 కిలోమీటర్ల మేర మూడు లైన్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కారిడార్లలో మొత్తం 35 స్టేషన్లు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇవాళ చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..వినతులు ఎన్ని ఉన్నా. అన్నిటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయి…ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version