చంద్రబాబు మళ్లీ మోడీతో జట్టు కట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు – మంత్రి కారుమూరి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజలకు పంగనామాలు పెట్టారని.. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. గత ఎన్నికల ముందు ప్రధాని మోదీని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ ఆయనతో జట్టు కట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు.

పేదలకు జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తుంటే చంద్రబాబు అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మాయమాటలతో ప్రజలని మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. ప్రజలను మరోసారి వంచన చేయాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సిపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news