అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో, నిన్న నోవాటెల్‌ హోటల్‌ లో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ,అమిత్ షా ఉపయోగము లేకుంటే నిమిషం కూడా ఎవరితో మాట్లాడరని చెప్పారు.

బిజెపిని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్ తో, అమిత్ షా సమావేశం అయ్యాడని భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మద్దతుతో బిజెపిను బలపరచుకోవడానికే అమిత్ షా ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. పాన్ ఇండియా స్టార్ అయినా జూనియర్ ఎన్టీఆర్ తో బిజెపి దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. చంద్రబాబుతో ప్రయోజనం లేదని డిల్లీలో మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని పేర్కొన్నారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news