ధూళిపాళ్ల సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్

-

ఏపీ సీఎం జగన్ పై ధూళిపాళ్ల సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. సినిమా హీరో వస్తే జనం ఓట్లు వేస్తారనే రోజులు పోయాయని.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సరిపోరని.. ఆయన వీకెండ్ పొలిటిషన్ అని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే పూర్తి సమయం కేటాయించవలసి ఉంటుందన్నారు రోజా.

జగన్ మళ్ళీ సీఎం కాలేరని పవన్ అంటున్నారని.. గత ఎన్నికలలో పవన్ ను ప్రజలు కనీసం అసెంబ్లీ గేటు కూడా తాగనివ్వలేదన్నారు. సొంత ఊర్లోనే అన్నదమ్ములను జనం చిత్తుగా ఓడించారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఏనాడైనా రెండు కాళ్లపై నిలబడడం చూశారా? ఆయన ఏనాడు కాళ్ళ మీద నిలబడడు, మాటమీద నిలబడడని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో వారానికి ఒకసారి వస్తుంటారని. ఈసారి ఓడిస్తే ఇక ఈ చుట్టుపక్కలకు కూడా రాడని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version