మనకు “సాక్షి” ఉంది కానీ.. “మనస్సాక్షి” లేదు – ఎంపీ రఘురామకృష్ణరాజు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. మనకు సాక్షి ఉంది కానీ.. మనస్సాక్షి లేదని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఉద్యోగులపై వైసీపీ ఉక్కు పాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల నిరసనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అప్పుల్లో ముంచేసారని.. ఆయనకు రుణ రత్న అవార్డు ఇవ్వాలని విమర్శించారు.

కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడంపై స్పందించారు. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దుర్మార్గమని అన్నారు రఘురామ. మనం ఒకరికి పెట్టం.. ఇతరులను పెట్టనివ్వం అని దుయ్యబట్టారు. ఉద్యోగుల జోలికి వెళ్లొద్దని.. పార్టీని ఉద్యోగులకు, ప్రజలకు దూరం చేయవద్దన్నారు. ఉద్యోగుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version