తిరుమల భక్తులకు షాక్.. 27, 28 తేదీల్లో ఆ సేవలు రద్దు ?

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ షాక్‌. తిరుమల లో 27, 28న ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. ఈ నెల 27న శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు. ఉటోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను ఈ నెల 27, 28న రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు టీటీడీ అధికారులు.

Officials said that many of the scheduled services conducted in the Srivari temple will be canceled on 27th and 28th of this month.

ఇక అటు  తిరుమలకు నేడు మెగాస్టార్ చిరంజీవి వెళ్లనున్నారు. రేపు అంటే ఆగస్ట్‌ 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు మెగాస్టర్‌ చిరంజీవి. ఇక ఇందులో భాగంగానే.. ఇవాళ సాయంత్రానికి తిరుమల చేరుకొని, రేపు వేకువజామున సుప్రభాతసేవలో పాల్గొననున్నారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version