జగన్‌ చెవిలో రఘురామ గుసగుస..వీడియో వైరల్ !

-

Raghu Rama Krishna Raju Chit Chat With Ys jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే..ఈ ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పక్కపక్కన సీట్లలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కూర్చున్నారు. మొదటగా జగన్ వద్దకు వెళ్లి విష్ చేశారు రఘురామ కృష్ణంరాజు.

Raghu Rama Krishna Raju Chit Chat With Ys jagan

అనంతరం జగన్ వద్దకు వెళ్లి, చెవిలో ఏదో మాట్లాడారట రఘురామ. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌ గా మారింది. కాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇద్దరూ బద్ధ శత్రువులు అన్న సంగతి తెలిసిందే.

ఇక అటు పోలీసులకు జగన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నల్ల కండువా కప్పుకొని అసెంబ్లీకి బయలుదేరారు జగన్. జగన్‌ తో పాటు అసెంబ్లీకి వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు. నల్ల కండువా కప్పుకొని మరీ అసెంబ్లీకి వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు. వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చిన క్రమంలో వైసీపీ నేతల వద్ద ఉన్న పేపర్లు లాక్కొని పోలీసులు చించేశారు.

https://www.youtube.com/live/Fd-Z6qpCRNc

https://www.youtube.com/live/Fd-Z6qpCRNc

Read more RELATED
Recommended to you

Exit mobile version