నేడు విశాఖకు రక్షణ మంత్రి రాజ్​నాథ్

-

రక్షణమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్‌ ఈరోజు (జూన్ 14వ తేదీ) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలోని తూర్పు నౌకాదళం ముఖ్య కార్యాలయానికి ఆయన రానున్నారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు దిల్లీలో బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖపట్నంలోని నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ‘ఐఎన్‌ఎస్‌ డేగా’కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.50 గంటలకు విశాఖ తీరంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ జలాశ్వ నౌకపై దిగనున్నారు.

మధ్యాహ్నం 12.55 నుంచి 2.15 వరకు ఈస్ట్రన్‌ ఫ్లీట్‌లో ‘డే ఎట్‌ సీ’ కార్యక్రమంలో పాల్గొని 2.30 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని 3.15 గంటలకు విశాఖ షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం 6.55 గంటలకు రాజ్​నాథ్ సింగ్ దిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version