వాలంటీర్లను తప్పించాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం దుర్మార్గం – సజ్జల

-

వాలంటీర్లను తప్పించాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం దుర్మార్గం అంటూ ఫైర్‌ అయ్యారు సజ్జల రామకృష్ణా రెడ్డి. బాబు పాలన అంతా విధ్వంసం…ప్రజలను ఇబ్బంది పెడతారు…. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు. వాలంటరీ ల వ్యవస్థ పై ముందు నుంచి చంద్ర బాబు కక్ష్య పెంచుకున్నారుఎన్నికల పేరుతో వాలంటరీ ల వ్యవస్థ ను ఆపాలని చంద్ర బాబు ఇండైరెక్ట్ గా ఈసీ కి పిర్యాదు ఇప్పించారని మండిపడ్డారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

Sajjala Ramakrishna Reddy’s key comments on Chandrababu’s health

చంద్ర బాబు స్వయంగా చెప్పవచ్చు…వాలంటరీ వ్యవస్థ మంచిది కాదు అని…జన్మభూమి కమిటీలు తెస్తామని… చంద్ర బాబు దొంగ దెబ్బ తీస్తున్నారని ఆగ్రహించారు.వాలంటరీ ల వ్యవస్థ చంద్ర బాబు,దత్త పుత్రుడు ఆలోచన ఎంటో అందరికీ తెలుసు…సిటిజన్ ఫర్ డెమోక్రసి అనే సంస్థను చంద్ర బాబు పెట్టించారని విమర్శలు చేశారు. వాలంటరీ ల వ్యవస్థతో జగన్ కు మేలు చేస్తారని చంద్ర బాబు ఆలోచన అని… చంద్ర బాబు డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు లేఖలు రాయడం మొదలు పెట్టారని నిప్పులు చెరిగారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version