వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సీజేఐ విస్మయం

-

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ ఉత్తర్వుల పట్ల సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జులై 1న బెయిల్‌పై విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు గత నెల 27న జారీ చేసిన ఉత్తర్వుల పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇవేం ఉత్తర్వులంటూ విస్మయం వ్యక్తం చేశారు.

గత నెల 27న తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ.. మే 5వ తేదీ లోపు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును జూన్‌ 30 లోపు ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలో గంగిరెడ్డిని జులై 1న పూచీకత్తు తీసుకొని బెయిల్‌పై విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం విచారించింది.

వాదనలు ప్రారంభమైన వెంటనే సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు ఉత్తర్వుల గురించి ధర్మాసనానికి వివరించారు. ఇదో విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. అందుకు సీజేఐ స్పందిస్తూ.. ఒకవైపు బెయిల్‌ రద్దు చేస్తూనే మరోవైపు నిన్ను ఫలానా రోజు విడుదల చేస్తున్నాం అని చెప్పడమా? ఇదేంటి అని విస్మయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version