ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది – మంత్రి జోగి రమేష్

-

ఇది ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని అన్నారు మంత్రి జోగి రమేష్. నేడు విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభ విజయవంతం కావడానికి సీఎం జగన్ సంక్షేమ పాలనే కారణమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టిడిపి అడ్రస్ గొల్లంతు కావడం ఖాయం అన్నారు. ఇక కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారని జోష్యం చెప్పారు జోగి రమేష్.

బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమేనని కొనియాడారు. మరో మూడు దశాబ్దాల పాటు సీఎం జగన్ పాలనను బలహీనవర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని.. బీసీల కి అండగా నిలబడిన వైయస్ జగన్ కి బలహీన వర్గాలు కూడా అండగా ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news