BREAKING : నేడు నారా లోకేష్ 100వ రోజు పాదయాత్ర

-

BREAKING : నేడు నారా లోకేష్ 100వ రోజు పాదయాత్ర. నారా లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించి నేటికి.. 100 రోజులు పూర్తయింది. ఇక 100వ రోజు పాదయాత్రలో భాగంగా ఇవాళ.. ముత్తుకూరు, పెద్దదేవలాపురం, సంతజూటూరు, పరమటూరు క్రాస్, బండిఆత్మకూరు లో కొనసాగనుంది నారా లోకేష్‌ పాదయాత్ర. ఇది ఇలా ఉండగా.. అంతకు ముందుకు జగన్‌ సర్కార్‌ పై నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు.

రాయలసీమ ప్రజలకు సాగునీరు, చెన్నై ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో దివంగత మ‌హానాయ‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు కృషితో సాకార‌మైన తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శించాను.వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (తెలుగుగంగ‌)ని చూశాక, ఇది మా తాత ఎన్టీఆర్ చొర‌వ‌తో నిర్మాణమైంద‌ని, నా తండ్రి హ‌యాంలో చెన్నైకి నీరు ఇవ్వ‌గ‌లిగామ‌నే గ‌ర్వం నాలో తొణికిస‌లాడింది.తెలుగుదేశానికి రాయ‌ల‌సీమ‌పై ఉన్న ప్రేమ‌కి నిద‌ర్శ‌నం తెలుగుగంగ ప్రాజెక్టు. వెలుగోడు రిజర్వాయర్ దిగువన ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాను అంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news