సొంత నియోజకవర్గంలోనే సీఎం జగన్ ఓటమి ఖాయం.. తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కి పరాభవం తప్పదు అన్నారు. సొంత నియోజకవర్గంలోనే జగన్ ఓటమి పాలవ్వడం పక్కా అని తులసి రెడ్డి జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన మండలి, వార్డు ఎన్నికలే ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. వైసీపీ, బీజేపీలను ఓడిస్తేనే రాష్ట్రం, దేశం సుబిక్షంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. 

2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. జగన్ సీఎం కాకముందే దేశంలోని ముఖ్యమంత్రుల అందరికంటే అత్యంత ధనవంతుడు అని తులసి రెడ్డి చెప్పారు. తనకు రూ.370 కోట్లు ఆస్తులు ఉన్నట్టు జగన్ అఫిడవిట్ లో పేర్కొన్నారని.. 9 మంది వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా కోటీశ్వరులేనని.. వారిలో నలుగురు బిలియనీర్లు కూడా ఉన్నారని తులసి రెడ్డి వెల్లడించారు. అయినప్పటికీ తమది పేదల పార్టీ అని సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని.. ఏపీలో సహజ వనరులు అన్నీ దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు తులసిరెడ్డి. చెల్లెళ్లు షర్మిల, సునీతకు న్యాయం చేయలేని జగన్ మహిళా సాధికారతకు కృషి చేస్తారా ? అని ప్రశ్నించారు తులసిరెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version