పిఠాపురంలో ఓటర్ల ధర్నా..తమకు ఇంకా డబ్బులు ఇవ్వడం లేదని రచ్చ !

-

Voters’ dharna in Pithapuram: పిఠాపురంలో ఓటర్లు ధర్నాకు దిగారు. తమకు ఇంకా డబ్బులు ఇవ్వడం లేదని రచ్చ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం కొండెవరంలో ఓటుకు డబ్బులు ఇవ్వలేదని రోడ్డు పై ధర్నా చేపట్టారు గ్రామస్తులు. నిన్నటి నుండి వైసీపీ నేతలు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు సొంటివారి పాకల, ఇందిరా కాలనీ గ్రామస్తులు. స్థానిక వైసీపీ నాయకుడు దాదాపు 100 కుటుంబాలకు చెందిన డబ్బులు నొక్కేశాడని ఆరోపణలు చేస్తున్నారు.

Voters’ dharna in Pithapuram

కాగా, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పలు ప్రాంతాల నుంచీ ఏపీకి చేరుకుంటున్నారు.. ప్రధానంగా బెంగళూరు, హైదరాబాదు ల నుంచీ అధిక సంఖ్యలో ఓటర్లు గన్నవరం ఎయిర్ పోర్టుకు వస్తున్నారు… భారీ సంఖ్యలో ఏపీకి వస్తున్న ఓటర్లు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలని వస్తున్నాం అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version