ఎల్లో మీడియా నా మాటలను వక్రీకరించి రాస్తుంది: హోంమంత్రి తానేటి వనిత

-

తల్లులను కించపరిచేలా హెడ్డింగులు పెట్టి, అసలు తన నోటి లో నుండి రాని మాటను మాట్లాడినట్టుగా, రాష్ట్రంలోని ఆడబిడ్డల తల్లులు అందరినీ అవమానపరిచి, కించపరిచింది ఆంధ్రజ్యోతే అని హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు, భావాలను వక్రీకరించి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపడానికి ఎల్లో మీడియా ద్వారా, టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరాటపడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఆడపిల్ల పై సొంత తండ్రి అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలో ప్రస్తావించి మాట్లాడుతున్నప్పుడు.. ఇంట్లో ఆడపిల్లలపై అలాంటి సంఘటనలు జరగకుండా తల్లి కనిపెట్టుకొని ఉండాలని, ఆ బాధ్యత తల్లి పైనే ఉంటుందని ఓ తల్లిగా తాను మాట్లాడానని అన్నారు. ఎందుకంటే కొన్ని ఘటనలు చూసినప్పుడు ఇంట్లో ఆడపిల్లలపై సొంత తండ్రే అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ ఆడ పిల్లని తల్లి కాకుండా ఇంకా ఎవరు కాపాడగలరు..? అందుకే కన్న బిడ్డలను తల్లి మాత్రమే కాపాడగలరు అన్నది నా ఉద్దేశం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news