ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహిస్తా: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

-

నెల్లూరు జిల్లా వైసీపీ లో అంతర్గత పోరు రచ్చకెక్కింది.మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదం తీవ్రతరమైంది.మంత్రి కాకాని కోసం నెల్లూరులో రేపు సభ నిర్వహిస్తున్నారు.ఇదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్ కూడా కార్యకర్తలతో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.సభ ఏర్పాట్లను శనివారం నాడు అనిల్ కుమార్ పరిశీలించారు.సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తన అనుచరులను ఆదేశించారు.అంతే కాదు రాత్రి భోజనం తో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.ఈ సందర్భంగా అనిల్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ఉండడం గమనార్హం.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ సభను నిర్వహించి తీరుతామని చెప్పారు.ఇది ఎవరికీ పోటీ కాదని అన్నారు.మూడు రోజుల ముందే సభకు అనుమతి తీసుకున్నామని తెలిపారు.సభను వాయిదా వేసుకోవాలని పార్టీ హైకమాండ్ కూడా చెప్పలేదని అన్నారు.ఎవరో కార్యక్రమం పెట్టుకున్నారని, తాను సభను పెట్టడం లేదని..ఎట్టి పరిస్థితుల్లోనూ సభను నిర్వహించి తీరుతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news