BREAKING : రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

-

Breaking : రేపు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ ఢిల్లీ పర్యటన లో ప్రధాని మోడీ తో భేటీ కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అలాగే 30 వ తేదీన జరుగనున్న జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఈ సమావేశానికి ప్రధాని, సీజేఐ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారం పై సెమినార్ ఉండనుంది.

ఇది ఇలా ఉండగా ఇవాళ సీఎం జగన్ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగoగానే ఉదయం 9.20 కి తాడేపల్లి నుంచి బయలు దేరి… 10:40 కి అనకాపల్లి జిల్లా సబ్బవరం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటల 5 నిమిషాలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవo, సహా లే అవుట్లను పరిశీలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news