ఏపీలో భారీగా తగ్గిన కరోనా : 24 గంటల్లో 771 కేసులు

-

ఏపీ లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గు ముఖ్యం పడుతున్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 771 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,48,230 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 08 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14 , 150 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 11,912 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1, 333 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,22,168 లక్షలకు చేరింది.

ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 45,592 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,81,78,305 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొన్నటి వరకు పెరిగిన కరోనా కేసులు.. ఇప్పుడు తగ్గడం శుభ పరిణామం.

Read more RELATED
Recommended to you

Latest news