Breaking : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారి కోసం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు

-

ఏపీలోని వైసీపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వాల్మీకి, బోయ, బెంతు ఒరియాల సామాజిక స్థితిగతులపై అధ్యయనానికి నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సామాజిక వర్గాల స్థితిగతులపై 3 నెలల్లోగా నివేదిక అందజేయాలని కమిషన్ కు సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని వాల్మీకి, బోయలను బీసీల జాబితా నుంచి ఎస్టీ జాబితాలోకి చేర్చాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.

Andhra CM YS Jagan urges Union health minister to sanction medical colleges  in 12 districts - India Today

ఈ క్రమంలో ఈ డిమాండ్ సాధ్యాసాధ్యాలు, ఆయా సామాజిక వర్గాల స్థితిగతుల ఆధారంగా ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలపై అధ్యయనం చేసేందుకే ఈ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా వీరిని ఎస్టీల జాబితాలో చేర్చే విషయంపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news