సమ్మె పై వెనక్కి తగ్గే సమస్యే లేదు.. జగన్ సర్కార్ కు ఉద్యోగుల వార్నింగ్ !

-

ఏపీ జేఎసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు.. జగన్ సర్కార్ వార్నింగ్ ఇచ్చారు. సమ్మె పై వెనక్కి తగ్గే సమస్యే లేదని.. ఉద్యోగులం అందరం ఏకాభిప్రాయానికి వచ్చామని.. సచివాలయంలోని కార్యాలయంలో ఇవాళ అన్ని డిమాండ్లపై చర్చిస్తామని పేర్కొన్నారు. మెరుగైన పీఆర్సీ సహా ఎలాంటి డిమాండ్లు పెట్టాలనే అంశంపై చర్చిస్తామని.. సమావేశంలో జరిగిన వివరాలను మా జెఎసీ సమావేశంలో తెలియజేస్తామని పేర్కొన్నారు.


ఇప్పటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మా జేఎసీ ల ఐక్య వేదికలో చర్చిస్తామన్నారు. ఇవాళ ఏపీ సీఎస్ కు సమ్మె నోటీసు ఇస్తామని ప్రకటన చేశారు. సమ్మె నోటీసు పై వెనక్కి తగ్గేది లేదని.. అందరం కలసి రేపు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అందరి సమస్య కాబట్టి ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని.. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాడి డిమాండ్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యమై ఒకే వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించామని.. మెరుగైన పీఆర్సీ కోసం కలసి పోరాడాలని నిర్ణయించామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news