బాటిల్ లో వినాయకుడు.. ఈ కళాకారుడి ప్రతిభ చూస్తే మెచ్చుకుంటారు..!

-

చాలా మంది కళాకారులు తమ ప్రతిభను చూపిస్తూ ఉంటారు. నిజంగా కొంత మంది కళాకారుల ట్యాలెంట్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. అయితే ఈ సంవత్సరం వినాయకచవితి సందర్భంగా ఓ కళాకారుడు అద్భుతమైన ట్యాలెంట్ ని చూపించారు. నిజంగా ఈ కళాకారుడి ఆర్ట్ చూస్తే ఎవరైనా మెచ్చుకుంటారు.

వినాయక చవితి సందర్భంగా ఈ కళాకారుడు అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే మరి ఇంతకీ కళాకారుడు చేసింది ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మినియేచర్ ఆర్టిస్ట్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని బాటిల్లో తయారు చేయడం జరిగింది. వివరాలను చూస్తే భువనేశ్వర్ కి చెందిన ఎల్ ఆర్ ఈశ్వర్ రావు వినాయక చవితి సందర్భంగా ఆ బాటిల్లో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది.

ఆయిన 350 మిల్లీలీటర్ల బాటిల్ తీసుకుని అందులో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాన్ని చేసారు. నిజంగా ఇలా బాటిల్లో గణపతిని తయారు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్నదే. వారం రోజుల పాటు మట్టి వినాయకుడును బాటిల్ తో తయారు చేశారు.

ప్రతి సంవత్సరం కూడా మనం వినాయక చవితి జరుపుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం నేడు అనగా 31న వచ్చింది. రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి వలన అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుకోవడం లేదు తిరిగి మళ్లీ ఈ సంవత్సరం మనం వినాయక చవితిని వైభవంగా జరుపుకునే అవకాశం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news