“‘అసని’” తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

-

ఏపీ: తీరంలో ‘అసని’ అలజడి సృష్టిస్తోంది. విశాఖను సమీపించి ఒడిశా వైపుగా కదలనున్న తీవ్ర తుపాను… సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ తో.. కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంపై ‘అసని’ తుపాను ప్రభావం చూపుతోంది. సోమవారం ఉదయం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.

తీరప్రాంతం కోతకు గురవుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా తీర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వివరించారు. రాగల రెండ్రోజులపాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news