పుట్టినరోజు నాడే కన్నీటి పర్యంతమైన అసెంబ్లీ స్పీకర్ పోచారం

-

తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. శుక్రవారం స్పీకర్ పోచారం 74వ వసంతంలోకి అడుగు పెట్టారు. జన్మదినం సందర్భంగా అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పోచారం. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఆయన తన ప్రాణ స్నేహితుడు సాలంబిన్ ని గుర్తుచేసుకొని ఆయన తీవ్ర భాగోద్వేగానికి లోనయ్యారు.

తన మిత్రుడి మరణం కారణంగా నియోజకవర్గంలో తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారని తెలిపారు. సాలంబిన్ అలీ ఖాన్ అంత్యక్రియలకు ప్రత్యేక హెలికాప్టర్ లో స్పీకర్ వెళ్ళనున్నారు. ఇక తన పుట్టినరోజు వేడుకలను అసెంబ్లీ లోను జరుపుకోరాదని నిర్ణయించుకున్నానని, కానీ ఇక్కడ ముందే ఏర్పాట్లు చేసి ఉండడంతో జరుపుకోవాలని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news