విశాఖలో హై టెన్షన్ : ఎమ్మెల్యేపై రాళ్ళ దాడి..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం తార స్థాయికి చేరుకుంది. నాయకులు, కార్యకర్తలు మితిమీరిపోతున్నారు. నిన్న, మొన్నటి వరకు విమర్శలకే పరిమితమైన వారు ఇవాళ దాడులకు తెగబడుతున్నారు. ఇందుకు ఇవాళ విశాఖపట్నంలో జరిగిన ఘర్షనే నిదర్శనం. విశాఖలోని అరిలోవ 13వ వార్డులో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అక్కడి టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వైసీపీ మద్దతుదారుల తీరుకి నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తమపై రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరగడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా వుంది.

Read more RELATED
Recommended to you

Latest news