భర్తలేడని పూజారితో అంటీ అక్రమ సంబంధం.. చివరికి

-

అక్రమ సంబంధాలు ఎప్పటికైనా విషాదాంతాన్నే మిగిల్చుతాయి. అయితే.. భర్తలేని ఓ మహిళ పూజారితో వివాహేర సంబంధం ఆమెను చిక్కుల్లోకి నెట్టింది.. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ధర్మపురి పక్కనే ఉన్న పంచపల్లి సమీపంలోని గంగపాళ్యంలో చిన్నఫయ్యన్ నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య పేరు జయలక్ష్మి, జయలక్ష్మి వయసు 52 ఏళ్లు, మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి జయలక్ష్మి తరువాత ఇంటికి తిరిగి రాలేదు.

Illegal affair: ప్రియురాలిని ఇంటికే పిలుచుకుని వెళ్లాడు, భార్య సైలెంట్,  కూతురు రివర్స్, క్లైమాక్స్ లో !

ఇంతలో రక్తపు గాయాలతో పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న జయలక్ష్మిని చూసిన గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జయలక్ష్మిని ధర్మపురి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి పంచపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన జయలక్ష్మిని పోలీసులు విచారించగా ఓ గుర్తు తెలియన వ్యక్తి తనపై దాడి చేసి బలవంతంగా చెవిలోని కమ్మలు లాక్కోని వెళ్లిపోయాడని చెప్పింది. ఆ వ్యక్తి కమ్మల్ని లాక్కొని తన మీద దాడి చెయ్యడంతో రక్తం కారడంతో స్పృహతప్పి పడిపోయానని జయలక్ష్మి పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి అనేక కోణాల్లో విచారణ చేశఆరు. చెవికమ్మలు చోరీ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలించారు. పోలీసుల విచారణలో ఎట్టకేలకు జయలక్ష్మి అసలు మ్యాటర్ బయటకు తీసుకొచ్చారు.

పంచపల్లి పక్కన కూతాడిపట్టిలోని ఆలయ పూజారిగా పని చేస్తున్న మదన్ పేరు తెరమీదకు వచ్చింది, జయలక్ష్మి భర్త చిన్నఫయ్యన్ గత 10 ఏళ్ల క్రితం మృతి చెందాడు, ఆ తర్వాత ఆలయ పూజారి మదన్‌తో జయలక్ష్మికి అక్రమ సంబంధం ఏర్పడింది. కానీ, జయలక్ష్మికి మరో వ్యక్తితో కూడా అక్రమసంబంధం ఉందని, ఈ విషయం తెలుసుకున్న పూజారి మదన్ మనస్తాపానికి గురయ్యాడని పోలీసులకు తెలిసింది. ఈ విషయమై జయలక్ష్మి, మదన్ ల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పొలానికి వచ్చిన జయలక్ష్మిపై మదన్ ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. 27వ తేదీ ఉదయం ఈ స్టోరీ నడిచింది. ఈ దాడిలో గాయపడిన జయలక్ష్మి అక్కడే స్పృహతప్పి పడిపోయింది, జయలక్ష్మి చనిపోయిందని భావించిన మదన్ జయలక్ష్మి చెవులు కోసి బంగారు కమ్మలు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ కేసు సంబంధిత పూజారి మదన్‌ను పోలీసులు అరెస్టు చేసి అతడిని కూడా విచారిస్తున్నారు. జయలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news