చంద్రబాబుపై బాలకృష్ణ పగ తీర్చుకోవాలి – మంత్రి రోజా

-

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టిడిపి – వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంటున్న ఎన్టీఆర్ పేరుని తీసి..వైఎస్సార్ యూనివర్సిటీని జగన్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అసలు ఈ యూనివర్శిటీతో వైఎస్సార్‌కు సంబంధం లేదు. కానీ వైఎస్సార్ డాక్టర్ అని..అందుకే ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టమని చెబుతున్నారు.

అయితే.. దీనిపై బాలయ్య రంగంలోకి దిగి.. జగన్‌ సర్కార్‌ కు వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో బాలయ్యకు ఏపీ మంత్రులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రోజా కూడా బాలయ్యపై విరుచుకపడ్డారు. బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం తేడా వస్తే దబిడి దిబిడే..!! అంటూ ట్వీట్‌ చేశారు రోజా. అంతేకాదు.. తన తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబుపై బాలకృష్ణ పగ తీర్చుకోవాలని అన్నారు.

రైతుల పేరుతో చంద్రబాబు దొంగ పాదయాత్ర చేస్తున్నాడని ఆరోపించారు మంత్రి రోజా. అమరావతిలోని రైతులుు ఉన్నారా? రాయలసీమలో లేరా? అని ప్రశ్నించారు. హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news