బాలయ్య-పవన్ పోలిటికల్ ‘అన్‌స్టాపబుల్’..జగన్‌కు చెక్?

-

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఓ రేంజ్ లో మారుతున్నాయి. ఎప్పుడు తెరపై కనిపించని సమీకరణాలు ముందుకొస్తున్నాయి. ఊహించని కాంబినేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు-పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వాటిని బలపర్చేలా బాబు-పవన్ వ్యాఖ్యలు కూడా ఉంటున్నాయి. ఇప్పటికే బాబు..పవన్‌ని కలిశారు..కలిసి పనిచేద్దామని కోరారు. పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అంటున్నారు. ఇలా ఇద్దరు జగన్‌ టార్గెట్ గా ముందుకెళుతున్నారు.

ఓ వైపు రాజకీయ పరంగానే ముందుకెళుతూ..మరోవైపు రాజకీయాలకు సినీ రంగం మద్ధతు పెరిగేలా స్కెచ్ నడుస్తోంది. ఊహించని కాంబినేషన్స్‌తో ఫ్యాన్స్ కూడా ఒక్కటయ్యేలా చేస్తున్నారు. దానికి వేదిక ఆహా అన్‌స్టాపబుల్ నిలుస్తుంది. ఈ షోని ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన హోస్ట్ బాలయ్య..సినీ రంగా పరంగానే కాదు..పోలిటికల్ పరంగా కూడా పరోక్షంగా టీడీపీకి మద్ధతు పెరిగేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు హీరోగా, మరోవైపు టీడీపీలో హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య ఉన్నారు.

అయితే తన షోలో ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌లని తీసుకొచ్చి..సంచలనం రేపారు. ఇక ఇప్పుడు బాలయ్య షోకు పవన్ వస్తున్నారు. తాజాగా పవన్ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. ఇక బాలయ్య-పవన్ క్రేజీ కాంబినేషన్‌పై ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. ఇంతవరకు వీరు పెద్దగా కలిసిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు వీరు కలవడంపై సినీ రంగమే కాదు..రాజకీయ రంగంలో కూడా ఆసక్తి పెరిగింది.

అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య, పవన్ మధ్య పోలిటికల్ అంశాలపైనే ఎపిసోడ్ నడుస్తుందని తెలుస్తోంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌లు జగన్‌కు చెక్ పెట్టడానికే అని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే బాలయ్య…ప్రభాస్‌తో ఎపిసోడ్ ఫినిష్ చేశారు. దీని ద్వారా ఏపీలో ఉన్న క్షత్రియ ఓట్లని సైతం టర్న్ చేసేలా పరిస్తితి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఆహా అన్‌స్టాపబుల్ షో కాస్త..రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌లు ఇచ్చేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news