భువనేశ్వరిపై విమర్శలు చేయడం చాలా తప్పు : రెచ్చిపోయిన బాలయ్య

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న క‌న్నీళ్లు పెట్టుకున్న ఘ‌ట‌న‌ పై స్పందించారు హిందూ పురం టీడీపీ ఎమ్మెల్యే బాల‌య్య. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. తమ సోదరి భువనేశ్వరి పై  వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడం చాలా దారుణమని ఫైర్‌ అయ్యారు బాలయ్య.

భువనేశ్వరిపై విమర్శలు చేయడం కరెక్ట్‌ కాదన్నారు. జ‌రుగుతున్న అరాచ‌కాల‌కు స‌మాధానం జ‌న‌మే చెప్పాలని… నోటితో కాదు, ఓటుతో జ‌వాబు చెప్పాలని పేర్కొన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా వైసీపీ నేత లాగే వ్యవహరిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఎన్నడూ చూడాలేదన్నారు బాలయ్య. చంద్రబాబు పై వైసీపీ నేతలు చేసిన వ్యాక్యలను తాను ఖండిస్తున్నానని తెలిపారు బాల కృష్ణ. అసెంబ్లీ లో సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడం సాధారణం కానీ… మహిళలపై కామెంట్లు చేయడం దారుణమన్నారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news