ఫ్లెక్సీల పంచాయితీ.. సైబరాబాద్‌ సీపీకి బాల్క సుమన్‌ ఫిర్యాదు..

-

బీజేపీ పార్టీ నేతలు మేము హోడింగ్స్ ఏర్పాటు చేస్తే వాటిని తొలగించారంటూ సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి హైదరాబాద్ వస్తున్న సందర్భంగా హోడింగ్స్ ఏర్పాటు చేశామని, తెలంగాణ ప్రభుత్వం పథకాలతో నగరంలో హోడింగ్స్ ఏర్పాటు చేశామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఓఆర్‌ఆర్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటిని తొలగించారని ఆయన మండిపడ్డారు. తొలగించిన వారి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని బాల్క సుమన్‌ అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ విమర్శించే స్థాయి ఉందా అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి ఏమి తీసుకొచ్చావు ప్రజలకు చెప్పాలన్నారు. భద్రాచలం వద్ద ఉన్న ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్ తరలించినప్పుడు ఏం చేశారు.. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్షణగా ఉన్నారని, వచ్చే పార్లమెంట్ సమావేశాలు బీజేపీ చేసిన పాలన పైనా నిలదీస్తామన్నారు. జాతీయ కార్య వర్గం సమాశం పేరుతో అక్రమ దందాలకు పాల్పడ్డుతున్నారని, జాతీయ కార్యవర్గం సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిపై చర్చించండని ఆయన తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version