తుకుడే గ్యాంగ్‌లీడ‌ర్‌ను కేసీఆర్ ఎందుకు వెంట తీసుకెళ్లాడు..? బండి సంజ‌య్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ళ్లీ కొత్త నాట‌కానికి తెర‌లేపిండ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఇవాళ మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. అవినీతి ర‌హిత ప్ర‌భుత్వం మోడీ నాయ‌కత్వంలో న‌డుస్తుంద‌ని చిన‌జీయ‌ర్‌పేర్కొన్నారు. మేడారం అభివృద్ధి జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టే మొకం చూపించ‌లేక వెళ్ల‌లేదు.

గ‌వ‌ర్న‌ర్ వెళ్తే అధికారులెవ్వ‌రూ వెళ్లొద్ద‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఆదేశాలు ఇచ్చారు. చంద్ర‌బాబుకు ప‌ట్టిన గ‌తే కేసీఆర్‌కు ప‌ట్ట‌బోతుంది. గ‌తంలో చంద్ర‌బాబు కూడా దేశం అంతా తిరిగిండు ఇప్పుడు ఆయ‌నే క‌నుమ‌రుగ‌య్యాడు. తుకుడే గ్యాంగ్‌లీడ‌ర్‌ను ఎందుకు కేసీఆర్ వెంట తీసుకెళ్లాడు. గ‌తంలో ప్రాంతీయ పార్టీలే ముఖ్య‌మ‌న్నా కేసీఆర్ ఇవాళ జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తా అంటున్నారు. తొలుత గ‌వ‌ర్న‌ర్ ను మెచ్చుకున్న ముఖ్య‌మంత్రి ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ చేప‌ట్టిన ఉద్య‌మాల వ‌ల్ల‌నే సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బ‌య‌ట తిరుగుతున్నార‌ని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news