ఎస్టీ రిజర్వేషన్లంటూ కేసీఆర్ డ్రామా: బండి సంజయ్

-

ఎస్టీ సామాజిక వర్గాన్ని మోసం చేసిన కేసీఆర్.. నేడు ఎస్టీ రిజర్వేషన్లు అంటూ డ్రామాలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ‘వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి జీవో తెచ్చి అమలు చేస్తానన్నావ్. మరి ఇన్నేళ్లుగా ఎందుకు అమలు చేయలేదు? కేంద్రం అడ్డుకుంటుందని అబద్ధాలు ఎందుకు చెప్పావ్? 8 ఏళ్లుగా గిరిజన బంధు, పోడు భూముల పట్టాలెందుకు ఇవ్వలేదు?’ అని నిలదీశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ఎవరూ అడ్డుకున్నారని ప్రశ్నించారు.కేంద్రమే అడ్డుకుందని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Masjid-mandir row reaches Telangana; BJP chief Bandi Sanjay vows to  establish 'Ram Rajya' - India News

తక్షణమే పది శాతం గిరిజన రిజర్వేషన్లు, పోడు భూములకు పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన సమస్యలపై మొదట నుంచి కొట్లాడి జైలు పాలైంది బీజేపీ నేతలేనని బండి సంజయ్ తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే కావాలన్న ఆయన.దొంగ జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటే వదిలిపెట్టమని హెచ్చరించారు. నయా నిజాం ఖాసిం చంద్రశేఖర రజ్వి పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలిగిస్తామని స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news