బడి బాటకు సిద్ధమవుతున్న బీజేపీ.. నేడు బాసర ట్రిపుల్‌ ఐటీకి బండి సంజయ్‌

-

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై పరిశీలన జరిపి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు బీజేపీ బడిబాట పట్టనుంది. రాష్ట్రంలో విద్యాసంవ త్సరం మొదలు కావడంతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మన ఊరు– మన బడి’ సాగు తున్న నేపథ్యంలో బీజేపీ కార్యక్రమానికి రాజ కీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల 25వ తేదీలోగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మొదలు అన్నిస్థాయిల నేతలు కనీసం ఒక ప్రభుత్వబడిని సందర్శించి, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఏ మేరకు అందు బాటులో ఉన్నాయో పరిశీలించనున్నారు.

ఇదిలా ఉంటే నేడు బండి సంజయ్‌ గత మూడు రోజులుగా బాసర ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్ని సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులు కలువనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను కలిసి కళాశాలలో నెలకొన్న సమస్యలపై బండి సంజయ్‌ చర్చించనున్నారు. అయితే.. ఇప్పటికే విద్యార్థులు కళాశాలను సీఎం కేసీఆర్‌ గానీ.. మంత్రి కేటీఆర్‌ గానీ వచ్చి సందర్శించి మా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వరకు నిరసన ఆపేది లేదని
స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version