లక్షల్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారా?..అయితే ఇది తప్పక తెలుసుకోవాలి..

-

డిజిటల్ పేమెంట్ చేస్తున్న వాళ్ళు ఈ మధ్య ఎక్కువ అయ్యారు..చిన్న ఎమౌంట్ నుంచి పెద్ద ఎమౌంట్ వరకూ ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలా ఎక్కువ మొత్తంలో డబ్బులను ట్రాన్స్ ఫర్ చేస్తున్న వారికి అలర్ట్.. ఆదాయపన్ను శాఖ కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. వాటి ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు లేదా అంతకు మించి చేసే డిపాజిట్లు, విత్ డ్రాలపై పాన్, ఆధార్ కార్డు తప్పని సరి చేస్తూ టాక్స్ డిపార్ట్ మెంట్ కొత్త నిబంధనలు తెచ్చింది. అయితే ఈ రూల్స్ మే 26 నుంచి అమలులోకి వచ్చాయి.

ఇకపై లావాదేవీలు చేసేటప్పుడు వీటిని తప్పక పాటించాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తన నోటిఫికేషన్ లో వెల్లడించింది.బ్యాంకులు, ఫోస్టాఫీసుల్లో ఇకపై జరిపే అధిక మెుత్తం లావాదేవీలు, ఇతర రకాలైనా ఖాతాలా చెల్లింపుల్లో పాన్ లేదా అధార్ వివరాలు అందించటం తప్పనిసరి. డిపాడిట్, విత్ డ్రాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాల అన్నిటి నుంచి డబ్బులను రూ.20 లక్షల లిమిట్ దాటి చెల్లింపులు చేసినా ఈ రూల్స్ వర్తిస్తాయి.

ఒకే సారి ఇంత మెుత్తంలో చేసే చెల్లింపులకు పాన్ కార్డు తప్పక ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కేవలం కమర్షియల్ బ్యాంకులు మాత్రమే కాకా పోస్టాఫీసులు, సహకార బ్యాంకుల్లో చేసే లావాదేవీలు కూడా పరిగణలోకి వస్తాయి.నగదు లావాదేవీల్లో ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు అధికారులు ఆదాయపుపన్ను చట్టంలో మార్పులు చేశారు..అందుకే లిమిట్ ప్రకారం చేసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news