BREAKING : తిరుమలలో క్షురకుల ఆందోళన

-

తిరుమలలో క్షురకులు ఆందోళనకు దిగారు. తమతో అసభ్యంగా వ్యవహరించిన విజిలెన్స్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తలనీలాలు సమర్పించే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారులు కల్యాణకట్టతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ

క్రమంలో విజిలెన్స్‌ అధికారులు తమ పట్ల అసభ్యంగా వ్యవహరించారని క్షురకులు ఆరోపిస్తున్నారు. తమ దుస్తులు విప్పి డబ్బులు ఎక్కడ దాచారంటూ తనిఖీలు చేశారని వారు ఆరోపించారు. క్షురకుల ఆందోళనతో ప్రధాన కల్యాణ కట్టతో పాటు పలు ప్రాంతాల్లో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు బారులు తీరారు.

క్షురకులు ఆందోళనకు దిగడంతో  ఇవాళ ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో దాదాపు 1100 మంది క్షురకులు ఉన్నారు. వీరిలో దాదాపు 750 మంది ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్నారు. భక్తుల తలనీలాలు తీసినందుకు టీటీడీ వీరికి నిర్ణీత రుసుము చెల్లిస్తోంది.

ప్రస్తుతం ఒప్పంద క్షురకులు మాత్రమే ఆందోళనకు దిగారు. శాశ్వత ఉద్యోగులుగా ఉన్నవారు విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల వసతి సముదాయం-1, 2, 3, నందకం, కౌస్తుభం, ఎస్వీ వసతి గృహాల్లో తలనీలాల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. తలనీలాలు సమర్పించే భక్తులు వేల సంఖ్యలో ఉండటం, క్షురకులు తక్కువమంది ఉండటంతో క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version