నిన్న డుమ్మా, ఈరోజు భేటీ.. భట్టి మరో వివాదం..!

-

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంకో అవమానం జరిగింది. సోషల్ మీడియాలో ఇది ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఇటీవల యాదాద్రిలో ప్రత్యేక పూజలు జరుగుతున్న టైం లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుని ప్రోటోకాల్ పాటించకుండా చిన్న పీట వేసి కింద కూర్చో పెట్టారని ఆరోపణలతో తీవ్ర వివాదం అయింది. దళితుడు కాబట్టే భట్టి ని ఇలా కింద కూర్చోబెట్టారని బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంఘాలు తీవ్రంగా కాంగ్రెస్ మీద మండిపడ్డాయి.

Deputy CM Bhatti Vikramarka’s key statement on Rythubandhu

ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అధికారికంగా ఫోటో దిగారు కానీ అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కనబడలేదు. భట్టి తప్ప సీఎం మంత్రులు గవర్నర్ తో ఫోటోలు దిగారు. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని నేడు ప్రత్యేకంగా గవర్నర్ తో భేటీ అయ్యారు భట్టి. ఆయనకి శుభాకాంక్షలు కూడా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version