ఈనెల 9 లేదా 10 తేదీల్లో బీజేపీలోకి ఆ ఇద్దరు నేతలు…!

-

తెలంగాణలో బీజేపీ మరింత బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్లే గడువు ఉండటంతో ఆలోపే బలపడేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీ నుంచి వరసల ద్వారా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నాయకులు పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీ నుంచి కీలక నాయకులను ఆకర్షిస్తున్నారు.

ఈనెలలో 9 లేదా 10 తేదీల్లో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, ఉద్యోగ సంఘాల నేత విఠల్, తీన్మార్ మల్లన్నలు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఇటీవల విఠల్ లో రాష్ట్ర బీజేపీ నేతలు మంతనాలు సాగించారు. గతంలో తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వం పెట్టిన కేసుల నేపథ్యంలో జైలు నుంచి విడుదల కావడానికి బీజేపీ పార్టీ సహకరించింది. ఆ సమయంలోనే తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతున్నారని తెలిసింది. కాగా వీరిద్దరు ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరుతున్నారని సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో వీరిద్దరు బీజేపీలో చేరనున్నారు. అయితే నడ్డా అపాయింట్మెంట్ ఖరారు అయిన తర్వాతే చేరిక ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news