భద్రతా బలగాలే టార్గెట్ గా మావోల బాంబ్ బ్లాస్ట్.. ముగ్గురు మృతి !

-

ఛత్తీస్‌ఘడ్ జిల్లా​ నారాయణ్​పుర్​ జిల్లాలో నక్సల్స్ విరుచుకుపడ్డారు. నారాయణపూర్ నుంచి బస్సులో వెళ్తుండగా ఐఈడీతో పేల్చారు. జిల్లా రిజర్వ్ గార్డు(డీఆర్​జీ) జవాన్లతో నిండిన బస్సును నక్సలైట్లు పేల్చివేశారు. ఈ సంఘటనలో, 3 సైనికులు మృతి చెందగా సుమారు 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. అయితే జవాన్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సైనికులందరూ ఆపరేషన్ నుండి తిరిగి వస్తున్నారని అంటున్నారు.

ఛత్తీస్గఢ్​​ డీజీపీ అవస్థి చెబుతోన్న వివరాల ప్రకారం 45 వ బెటాలియన్ ఐటీబీపీ సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది జవాన్లు ఉన్నట్లు చెబుతున్నారు. పేలుడు జరిగిన ఏరియాకు చేరుకున్న భారత బలగాలు తనిఖీలు మొదలు పెట్టాయి. నారాయణపూర్‌ జిల్లాలో కడేనార్‌, కన్హరగావ్‌ల మధ్య వెళ్తున్న ఈ బస్సును లక్ష్యంగా చేసుకొని ఐఈడీ పేల్చడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  ఘటనా స్థలానికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news