పవన్ ది సెలబ్రిటీ పార్టీ : మంత్రి బొత్స

-

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్ కల్యాణ్ ది సెలబ్రిటీ పార్టీ, మూడ్ వస్తేనే మాట్లాడుతుంటాడని అని అన్నారు బొత్స. గంటకో కులం అనే వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పవన్ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు బొత్స. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నాడని బొత్స విమర్శించారు. నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే నీతి, నిజాయతీతో పోరాడాలని హితవు పలికారు. అలా చేస్తే కనీసం ఏ 30 సంవత్సరాలకో అధికారం లభించే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. అప్పటి వరకు ఏంచేసినా ప్రయోజనం ఉండదని అన్నారు బొత్స.

సన్నాసి మాటలొద్దు-పవన్ కు బొత్స హెచ్చరిక- ధర్మాన వ్యాఖ్యల అంతరార్ధం ఇదే.. |  ap minsiter botsa satyanarayana strong counter to pawan kalyan-reacts  dharmana comments - Telugu Oneindia

ఇక తనపై జనసేనాని చేసిన విమర్శల పట్ల కూడా బొత్స స్పందించారు. తాను రాజకీయాల్లోకి వచ్చి టాటా, బిర్లా మాదిరి ఎక్కడ ఎదిగిపోయానో చెప్పగలరా అంటూ పవన్ ను నిలదీశారు. తన కంటే ముందు మంత్రులయిన వారు తూర్పు కాపు కులంలో చాలామంది ఉన్నారని, తాను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ ను చూపించమనండి అంటూ బొత్స పవన్ కు సవాల్ విసిరారు . వైసీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, బీసీలు తమ పార్టీకి, ప్రభుత్వానికి వెన్నెముక అని వ్యక్తపరిచారు బొత్స.

 

 

Read more RELATED
Recommended to you

Latest news