విద్యార్థుల సంఖ్య 150 దాటితే హెడ్‌మాస్టర్‌ : మంత్రి బొత్స

-

ఏపీలో వైసీపీ వర్సెస్‌ టీడీపీ మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వ పాఠశాలలు మూసి వేసిందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో విద్యాశాఖ మంత్ర బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. ఏపీలో ఒక్క పాఠశాలను కూడా మూసివేయలేదని… ఎక్కడైనా పాఠశాల మూతపడి ఉంటే విద్యా మంత్రిగా బాధ్యత స్వీకరిస్తానని అన్నారు. మూడు, నాలుగు, ఐదో తరగతుల విలీనం తర్వాత ఫౌండేషన్ స్కూళ్లను తీసుకొస్తామని చెప్పారు బొత్స సత్యనారాయణ . 270 స్కూళ్లలో విలీన సమస్య ఉన్నట్టు గుర్తించామని, ఏయే స్కూళ్లలో సమస్య ఉందో తెలపాలని ఎమ్మెల్యేలను కోరామని చెప్పారు బొత్స సత్యనారాయణ. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటితేనే హెడ్‌మాస్టర్‌ను నియమిస్తామన్న బొత్స సత్యనారాయణ.. విద్యార్థుల సంఖ్య 21 దాటితేనే మరో ఎస్టీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామని వెల్లడించారు.

Botsa Satyanarayana likely to have sway in N. Andhra

విదేశీ విద్య పథకానికి జగనన్న పేరు పెడితే తప్పేముందని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. అయినా, ఈ విషయంలో మరోసారి పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో గతుకులు పడిన 20 రోడ్లను గుర్తించామని, రోడ్ల మరమ్మతులకు రూ. 93 కోట్లతో టెండర్లు పిలుస్తామని తెలిపారు బొత్స సత్యనారాయణ. గ్రామీణ ప్రాంతాల్లో 27 రోడ్లను గుర్తించామని, ఆర్ అండ్ బీ పరిధిలో 50 కిలోమీటర్ల రోడ్డు పాడైనట్టు గుర్తించామని చెప్పారు. వీటన్నింటికి టెడర్లను పిలుస్తామని తెలిపారు బొత్స సత్యనారాయణ.

 

Read more RELATED
Recommended to you

Latest news