Breaking : ప్రేమను తిరస్కరించిందని కదిలే రైలు నుంచి తోసేసిన దుర్మార్గుడు

-

రోజు రోజుకు దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. ప్రేమ ప్రేమ అంటూ యువతుల వెంటపడుతూ ప్రేమను నిరాకరిస్తే.. ఆ యువతుల ప్రాణాలనే బలిగొంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. తన ప్రేమను తిరస్కరించిందని యువతిని ఓ యువకుడు రైలు కింద తోసేశాడు ఓ ప్రేమోన్మాది. దీంతో… బాధితురాలు అక్కడికక్కడే మరణించింది. ఈ విషాద ఘటన తమిళనాడు చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌లో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి తండ్రి మాణిక్యం(47) పోలీసు కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు. ఆయన కుమార్తె సత్య(20) టీనగర్​లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఆదంబాక్కంకు చెందిన సతీశ్(23) అనే యువకుడు సత్యను ప్రేమిస్తున్నాడు. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లేందుకు పరింగిమలై రైల్వే స్టేషన్​లో నిల్చొంది.

Stalker kills Chennai college student by pushing her in front of moving  train; accused on the run- The New Indian Express

అప్పడు అక్కడికి వచ్చిన సతీశ్.. సత్యతో గొడవకు దిగాడు. అనంతరం ఎదురుగా వస్తున్న రైలు కిందకు తోసేశాడు. ఈ క్రమంలో బాధితురాలు సత్య అక్కడికక్కడే మృతి చెందింది.నిందితుడు సతీశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సత్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు సతీశ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news