BREAKING : ఎంపీ అవినాష్ ను వెంటాడుతున్న సిబిఐ అధికారులు…

-

ఈ రోజు సిబిఐ వారి విచారణకు హైద్రాబాద్ లో హాజరు కావాల్సిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కాస్త, హాజరుకాకపోగా తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదన్న వార్తల మధ్య గత కొన్ని గంటలుగా కథ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నుండి అవినాష్ రెడ్డి తల్లిని చూడడానికి పయనమవ్వగా సిబిఐ అధికారులు కూడా తమ వాహనాలలో అతనైని వెంబడిస్తూ వచ్చాయి. కానీ మధ్యలోనే అవినాష్ రెడ్డి తల్లి అంబులెన్సు ఎదురుకావడంతో, పరామర్శించిన ఎంపీ ఆ తర్వాత ఆమె వెనుకే హైద్రాబాద్ కు పయనం అయ్యాడు. దీనితో సిబిఐ అధికారులు సైతం తమ రూటును మార్చుకుని వారి వెనకే హైదరాబాద్ కు బయలుదేరారు. మరికాసేపట్లో హైద్రాబాద్ కు చేరుకోనున్న అవినాష్ రెడ్డి తన తల్లిని మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ చేయించనున్నారు.

 

ఒక్కసారి హైద్రాబాద్ రీచ్ అయ్యాడంటే అక్కడ సిబిఐ అధికారులు అతని వెంటే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎటువంటి పరిస్థితిలో అవినాష్ రెడ్డిని వదిలేది అన్న ధోరణిలో అతని వెంటే తిరుగుతున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news