కేసీఆర్ టార్గెట్: మహారాష్ట్రలో 10 జెడ్పీలు గెలవాలి

-

తెలంగాణ సీఎం మరియు BRS పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. అందులో భాగంగా నిన్న సాయంత్రం మహారాష్ట్ర లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నామని ప్రకటన చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర BRS నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈ లోకల్ ఎలక్షన్స్ లో BRS పార్టీ ఖచ్చితంగా 9 నుండి 10 జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ నాయకులు సూచించారు. ఇక మరి కొన్ని రోజుల్లోనే మహారాష్ట్ర లో BRS పార్టీ ఆఫీస్ ను కూడా ప్రారంభిస్తామని కేసీఆర్ తెలిపారు. మరి BRS మహారాష్ట్ర లో ఎంతవరకు ఓట్లను సంపాదించగలదు అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news